పహాడీషరీఫ్, మార్చి 29: రాష్ట్రంలోనే చారిత్రాత్మకమైన పహాడీషరీఫ్ బాబా షర్పొద్దీన్ దర్గా ఉర్సు నేటి నుంచి వారం పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. చార్మినార్కు 11 కిలో మీటర్ల దూరంలో, శంషాబాద్ ఎయిర్పోర్టుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఏడాది నిర్వహించే ఉత్సవాలకు కులమతాలకతీతంగా హైదరాబాద్ నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. దర్గాలోని బాబా షర్పొద్దీన్ మందిరంలో పూలు, చాదరే-గులాపే సమర్పిస్తుంటారు.
నేటి నుంచి 4వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 30న అర్ధరాత్రి 12 గంటలకు బా లాపూర్ ఖసీదయేబుర్దాషరీఫ్ దర్గా నుంచి ఫాతి యా ఇప్పించి సందేల్ ఊరేగుంపుతో ర్యాలీగా పహాడీషరీఫ్ దర్గాకు వచ్చి కొండపై బాబా షర్పొద్దీన్కు సమర్పిస్తారు. 31న నిజాం ట్రస్టు ద్వారా పాతబస్తీ నుంచి గంధం ఊరేగింపు నిర్వహిస్తారు. 1నుంచి 3వ తేదీ వర కు సాయంత్రం దీపాలంకరణ, 4న పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ నుంచి ఆనవాయితీగా సాయంత్రం సర్కారీ గంధం తీసే కార్యక్రమం, 5న పహాడీషరీఫ్లో సం దెల్ ఊరేగింపు,సాయంత్రం ఉత్సవాలకు ము గింపు ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు.
ఉర్సుకు వచ్చే భక్తులు తప్పని సరిగా మాస్కు ధరించాలి. లేదంటే దర్శనానికి అనుమతించం.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాదితో కలిసి విద్యుత్ దీపాలు,తాగునీటి సరఫరా వంటి ఏర్పాట్లను పరిశీలించాం. పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. భక్తులు భౌతిక దూరం పాటించాలి.