వాషింగ్టన్ డీసీ : భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వనాయకుడిగా ఎంపికయ్యారు. గ్లోబల లీడర్స్ ర్యాంకింగ్ కోసం అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికా, బ్రిటన్తో పాటు 13 దేశాల నాయకులను తోసిరాజని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. మోదీకి వచ్చిన జనాదరణ 100 లో 66 శాతంగా ఉన్నది. అయితే, గత ఏడాది లభించిన ప్రజాదరణ ఈసారి 20 శాతం తక్కువగా ఉండటం విశేషం. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్, భారతదేశంలో దాని చెడు ప్రభావాల తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణ చెక్కుచెదరకుండా ఉన్నదని ఈ సర్వే వెల్లడిస్తున్నది.
అమెరికన్ డాటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో గ్లోబల్ లీడర్స్ ర్యాంకింగ్లో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ సర్వేలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు సహా 13 దేశాల నాయకులను చేర్చారు. ఈ సర్వేలో భారతదేశానికి చెందిన 2,126 మందిని చేర్చారు. ఇందులో 28 శాతం మంది మోదీ ప్రజాదరణను అంగీకరించలేదు. సర్వేలో కేవలం 3 దేశాల నాయకుల రేటింగ్ 60 శాతం పైన ఉండటం విశేషం. సర్వేలో మోదీ తర్వాత ఇటాలియన్ ప్రధానమంత్రి మారియో ద్రాగి ఉన్నారు. ఆయన రేటింగ్ 65 శాతం. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ మూడవ స్థానంలో 63 శాతం రేటింగ్తో ఉన్నారు.
ఈ నెల 7న మోదీ చేసిన ప్రసంగంతో ఆయన రేటింగ్ శాతం పెరగడానికి దోహదపడిందని పలువురు నిపుణులు వాదిస్తున్నారు. దేశంలోని 18 ఏండ్ల వయసు పైబడిన వారందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్లు అందజేస్తామని మోదీ చెప్పడంతో ఆయనకు ప్రజల్లో కొంత ఆదరణ పెరిగిందని చెప్పవచ్చునని వారంటున్నారు.
కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా గెలుపుపై గంగూలీ.. ఏం చెప్పాడంటే..?
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్లీ గురూ..!
మూడో అతిపెద్ద వజ్రం దొరికింది.. ఎక్కడంటే..?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..