ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధు షేక్ ముజ్బీర్ రెహ్మాన్కు ఇవాళ ప్రధాని మోదీ నివాళి అర్పించారు. గోపాల్గంజ్లో ఉన్న తుంగిపుర వద్ద ముజ్బీర్ రెహ్మాన్ సమాధి ఉన్నది. ముజ్బీర్ సమాధి వద్ద మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. నివాళి అర్పించిన తర్వాత కాసేపు మౌనం పాటించారు. బంగబంధు స్మృతి ప్రదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలను మోదీ తిరిగి చూశారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహనాలు కూడా మోదీకి స్వాగతం పలికారు. బంగబంధు స్మారక కాంప్లెక్స్ వద్ద తొలుత పుష్పగుచ్ఛంతో మోదీకి వెల్కమ్ పలికారు. స్మారక ప్రదేశం వద్ద మొక్కను నాటిన మోదీ.. ఆ తర్వాత విజిటర్స్ బుక్లోనూ సందేశం రాశారు. బంగ్లాదేశ్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న మోదీ.. ఇవాళ ఉదయం జెశోరేశ్వరి శక్తిపీఠాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఓరాకంటి ఆలయంలోనూ ఆయన పూజలు చేశారు.