సుల్తాన్బజార్, మే 19: కింగ్ కోఠి జిల్లా దవాఖాన కొవిడ్ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఇద్దరికి బ్లాక్ ఫంగస్ లక్షణా లు కనిపించడంతో ఒకరిని గాంధీ దవాఖానకు, మరొకరిని కోఠి ఈఎన్టీ దవాఖానకు తరలించారు. అంబర్పేటకు చెందిన ఓ వృద్ధురాలు (80) 15 రోజుల క్రితం కింగ్ కోఠి దవాఖానలో చేరింది. ఆ ఆమెకు కొవిడ్ తగ్గకపోగా, బుధవారం కండ్లలో తీవ్రమైన మంట మొదలవడం తో గాంధీ దవాఖానకు తరలించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలున్న మరో రోగికి కొవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో కోఠి ఈఎన్టీ దవాఖానకు తరలించారు.
కరోనా సోకి కోలుకున్నవారు ప్రాణాం తకమైన బ్లాక్ ఫంగస్ బారిన పడినవారికి మాత్రమే కోఠి ఈఎన్టీ నోడల్ దవాఖాన లో వైద్య చికిత్సలు అందిస్తామని దవా ఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్ పేర్కొన్నారు. దవాఖానలో ఏర్పా టుచేసిన బ్లాక్ ఫంగస్ వార్డులో ప్రస్తుతం 51 మంది చికిత్స పొందుతుండగా, ఇం దులో నలుగురికి శస్త్రచికిత్సలు పూర్తిచేసినట్టు ఆయన వివరించారు.