నర్సంపేట, మే 30 : నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో ఆదివారం కరోనా పరీక్షలు నిర్వ హించారు. 41 మందికి పరీక్షలు చేయగా వీరిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జాన్స న్ తెలిపారు. కరోనా బాధితులకు మందులు అందజేసి హోం ఐసొలేషన్ ఉండాలని సూచించామన్నారు. సౌకర్యం లేని వారికి ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందిస్తామని చెప్పా రు. ప్రతి ఒక్కరూ డబుల్ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆదివారం 24 మందికి కరోనా పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి ఉషారాణి తెలిపారు. బాపునగర్లో ముగ్గురికి, ముగ్ధుంపురం, పాపయ్యపేట, నర్సంపేట, చెన్నారావుపేట గ్రామాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్ వచ్చిందన్నారు. మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్వో వెంకటేశ్వరరావు, స్టాఫ్ నర్సు స్వరూపారాణి, హెల్త్ అసిస్టెంట్ కుండె శివాజీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆదివారం 160 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వీరిలో 17 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి రణధీర్ తెలిపారు. కరోనా బాధితులు ధైర్యం గా ఉండాలని, వైద్యుల సూచనలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. ఈకార్యక్రమంలో ఫార్మాసిస్టు కవిత, స్టాఫ్ నర్సు ఈశ్వరి పాల్గొన్నారు.
గీసుకొండలో..
గీసుగొండ : స్థానిక పీహెచ్సీలో ఆదివారం 32 మందికి కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి మాధవీలత తెలిపారు. బాధితులకు మందులు అందజేసి హోం ఐసొలేషన్కు పంపామని చెప్పారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకోవాలని, రెండో డోస్ తీసుకునే వారు పీహెచ్సీకి రావాలని ఆమె కోరారు.
సంగెంలో..
మండలంలోని గవిచర్లలో ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించగా స్థానిక సర్పంచ్ దొనికెల రమశ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా 100 మంది పరీక్షలు చేయగా ఆరుగురికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ కరోనా నివారణకు జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. సంగెం పీహెచ్సీలో 60 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ అశోక్ తెలిపారు.