వాషింగ్టన్, జూలై 20: ‘మిస్ ఇండియా యూఎస్ఏ-2021’ కిరీటాన్ని మిషిగన్కు చెందిన 25 ఏండ్ల వయసున్న వైదేహి డోంగ్రీ దక్కించుకున్నారు. మిచిగాన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న ఈ యువతి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ అందాల పోటీలో జార్జియాకు చెందిన ఆర్షి లలాని తొలి రన్నరప్గా నిలిచారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం, అక్షరాస్యతను పెంపొందించడమే తన లక్ష్యమని వైదేహి చెప్పారు.