నెపితా: మయన్మార్లో ఓ సైనిక విమానం కూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మండలే ప్రాంతంలో ఉన్న పియిన్ ఓ ల్విన్ పట్టణం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. వాతావరణం సరిగా లేని కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ విమానంలో సైనికులతో పాటు బౌద్ద సన్యాసులు కూడా ఉన్నారు. ఓ బౌద్ద ఆరామంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వాళ్లు వెళ్తున్నట్లు గుర్తించారు. పియిన్ ఓ ల్విన్ నగరంలో ఉన్న స్టీల్ ప్లాంట్కు 300 మీటర్ల దూరంలో విమాన దుర్ఘటన జరిగింది. విమానంలో ఆరుగురు సిబ్బంది, 8 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్తో పాటు మరో ప్రయాణికుడు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారిని మిలిటరీ హాస్పిటల్లో చేర్పించారు.