కింద ఉన్న వాహనాలపై పడిన రైలు..
23 మంది దుర్మరణం.. మెక్సికోలో ప్రమాదం
మెక్సికో సిటీ, ఏప్రిల్ 4: మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రాజధాని మెక్సికో సిటీలో మెట్రో వంతెన కూలి, కింద వెళ్తున్న వాహనాలపై రైలు పడటంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 70 మంది గాయపడ్డారు. స్థానిక కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదని అధికారులు తెలిపారు. ప్రస్తుత విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్.. మెక్సికో మేయర్గా ఉన్న సమయంలో (2006-12) ఈ మెట్రో లైన్ను నిర్మించారు. మెట్రో డిజైన్, నాణ్యతపై అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. మరోవైపు, 2017లో సంభవించిన భూకంపంతో మెట్రో దెబ్బతిన్నదన్న వాదనలు కూడా ఉన్నాయి.