సిద్దిపేట : బీజేపీకి ఎదురుదెబ్బ. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ముంగిట బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు శివరాత్రి నాగేష్, బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షుడు అలకుంట ఆనంద్ తమ అనుచరులు 200 మందితో కలిసి టీఆర్ఎస్లో చేరారు.
గత కొన్నేళ్లుగా పట్టణం సాధించిన అభివృద్ధి పట్ల ముగ్ధులైన ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరినట్లు హరీష్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు. దండు సంపత్, అలకుంట చిన్న, బోదాస్ కుమార్, వల్లపు మలేష్, కుమార్, వెంకట్, చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.