దిల్లీ: దేశ రాజధానిలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత ఆందోళనకలిగిస్తున్నది. ఢిల్లీలోని ప్రముఖ హాస్పిటల్ సర్ గంగారామ్ దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు అడుగంటుతుండటంతో శనివారం రాత్రి 10:30 గంటలకు దవాఖాన అధికారులు ప్రభుత్వానికి అత్యవసరంగా మెసేజ్ (ఎస్ఓఎస్) పంపారు. అప్పటికి కేవలం గంటకి సరిపడా ప్రాణవాయువు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. 130 మంది రోగులు ఐసీయూలో ఉన్నారని, మరో 30 మంది వెంటిలేటర్పై ఉన్నారని అందులో పేర్కొన్నారు.
దీంతో అప్రమత్తమైన స్థానిక ఎమ్మెల్యే రాఘవ్ చద్దా అధికారులతో మాట్లాడి ఆక్సిజన్ ట్యాంకర్ను తెప్పించారు. అది శనివారం అర్ధరాత్రి 12:20 గంటలకు ఒక మెట్రిక్ టన్ను ఆక్సిజన్ దవాఖానకు చేరింది. అయితే ఆ ఆక్సిజన్ రెండు గంటలకు మాత్రమే సరిపోతుందని దవాఖాన అధికార ప్రతినిధి 12:45 గంటలకు వెళ్లడించారు. కాగా, గంగారాం హాస్పిటల్కు ఫరీదాబాద్లోని ఒక పంపిణీదారుడు ఆక్సిజన్ పంపిచాలి. తెల్లారుజామున 3 గంటల ప్రాంతంలో ట్యాంకర్లు దవాఖానకు చేరాల్సిఉండగా.. గంటబావు ఆలస్యంగా 4:15 గంటల సమయంలో 5 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంకర్లు అక్కడికి వచ్చాయి. అదికూడా 11 నుంచి 12 గంటలు మాత్రమే సరిపోతుందని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..