నల్లగొండ : వెదజల్లే పద్దతిలో వరిసాగు విధానంపై నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ రైతులకు అవగాహన కల్పించారు. నియోజకవర్గంలోని నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ఓ రైతు పొలంలో వెదజల్లే పధ్ధతిలో వరిసాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే స్వయంగా పొలంలో దిగి వరి విత్తనాలను వెదజల్లారు. అనంతరం ఈ పద్దతిలో సాగుచేస్తే రైతులకు ఒనగూడే ప్రయోజనాలను వివరించారు. సాగు ఖర్చులు తగ్గుతుండటం, దిగుబడి పెరుగుతుండటం, పంట కాలం కూడా 10 నుంచి 15 రోజుల ముందే చేతికి రావడం వంటి లాభాలను తెలియజేశారు.