విక్టరీ వెంకటేష్ గుట్టుచప్పుడు కాకుండా దృశ్యం 2 సినిమాని స్టార్ట్ చేశాడు..అలాగే పూర్తి కూడా చేశాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు కూడా. మలయాళ దర్శకుడు జీతూజోసఫ్ డైరక్షన్ లో తెరకెక్కిన దృశ్యం 2 సినిమాలో వెంకీ పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తైంది.
దృశ్యం సీక్వెల్ గా తెరకెక్కిన ఈసినిమాని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళంలో ఈ సినిమాని తీసిన జీతూజోసఫే ఇప్పుడు తెలుగులోనూ తెరకెక్కించాడు.