హైదరాబాద్ : ఉపాధి హామీ రోజువారీ కూలీని రాష్ర్ట ప్రభుత్వం పెంచింది. రోజు వారీ కూలీ రూ. 237 నుంచి రూ. 245కి పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి పెరిగిన కూలీ అమల్లోకి రానుంది. కూలీ పెంచడంతో ఉపాధి హామీ కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.