మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 1: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం రూ.83 లక్షల డీఎంఎఫ్టీ నిధులను వెచ్చించి కొనుగోలు చేసిన 16 ఆటో ట్రాలీలను గురువారం మున్సిపల్లో ఎమ్మె ల్యే పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య పనుల్లో ఉపయోగపడే ఆటో ట్రాలీలను డీఎంఎఫ్టీ నిధు లు వెచ్చించి కొనుగోలు చేశామన్నారు.మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, కమిషనర్ స్వరూపారాణి, ఎంఈ మధూకర్, ఏఈ నర్సింహస్వామి, మేనేజర్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు సిబ్బంది పాల్గొన్నారు.
మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి
ప్రతి పల్లెలో మౌలిక సౌకర్యాలను కల్పించడానికి టీఆర్ఎస్ సర్కారు నిరంతరం కృషి చేస్తున్నదని, కాని కొంత మంది అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ప్రజలెవరూ నమ్మవద్దని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని గుల్లకోటలో రూ.9లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును ఆయన ప్రారంభించి, మాట్లాడారు. గుల్లకోట ముంపు బాధితులకు సరైన నష్టపరిహారం ఇవ్వడంతోపాటు ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, లక్షెట్టిపేట వైస్చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు చిన్నన్న, ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గుల్లకోట సర్పంచ్ గోళ్ల రవీందర్, సర్పంచ్లు, వార్డుమెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.