న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజువారీ కేసులతో పాటు మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 43,733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 47,240 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మరో 930 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,63,665కు పెరిగింది. మొత్తం 2,97,99,534 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ప్రభావంతో 4,04,211 మంది మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో 4,59,920 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 97.18శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.39శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.29శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. టీకాల పంపిణీ కార్యక్రమంగా వేగంగా సాగుతున్నదని తెలిపింది. మొత్తం 36.13 కోట్ల డోసులు టీకా డ్రైవ్లో పంపిణీ చేసినట్లు వివరించింది. నిన్నటి వరకు మొత్తం 42.33 కోట్ల కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.