కోదాడ టౌన్, మార్చి 30 : సహకార సంఘం అభివృద్ధికి పాలకవర్గం కృషి చేస్తున్నదని కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు అన్నారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అందించే ఫలాలు రైతులందరికీ చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్ నరేశ్, సీఈఓ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
చిలుకూరు : రైతుల సమష్టి కృషితోనే పీఏసీఎస్ అభివృద్ధి చెందుతుందని సంఘం చైర్మన్ బాష్యం సైదులు అన్నారు. బేతవోలు పీఏసీఎస్లో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ చంద్రకళానాగయ్య, ఎంపీటీసీలు ధనమూర్తి, సైదాబాబు, సీఈఓ పాషా, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
హుజూర్నగర్టౌన్ : పీఏసీఎస్ అభివృద్ధికి సహకరించాలని హుజూర్నగర్ సొసైటీ చైర్మన్ యరగాని శ్రీనివాస్ కోరారు. మంగళవారం సంఘం సమావేశం ఏర్పాటు చేసి వార్షిక నివేదికను సభ్యులకు అందించారు. పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : పెంచికల్దిన్నె పీఏసీఎస్ అభివృద్ధికి కృషి చేస్తానని సంఘం చైర్మన్ శ్రీకాంత్ అన్నారు. పీఏసీఎస్ డైరెక్టర్లతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైస్ చైర్మన్ శ్రీను, డైరెక్టర్లు జ్యోతి, కృష్ణకుమారి, లలిత, భుజంగరావు, సురేశ్, హరీశ్, సుధాకర్, శ్రీధర్, సీఈఓ వెంకన్న పాల్గొన్నారు.