హైదరాబాద్ : అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్) సందర్భంగా, దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటం అనేక రూపాల్లో సాగిందనీ, అమరుల త్యాగాలతో స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో “ఆజాదీకా అమృత్ మహోత్సవ్” ను దేశం సగర్వంగా నిర్వహించుకుంటున్నది. ఈ నేపథ్యంలో వారి త్యాగాలను స్మరించుకునే కార్యక్రమాలను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.