న్యూయార్క్: కరోనా ఉద్ధృతి ముగిసేనాటికి ప్రతీఒక్కరు వైరస్బారిన పడటం లేదా టీకా వేసుకోవడం లేదా రెండూ చేస్తారని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మినెసొటా డైరెక్టర్ మైకెల్ ఓస్టర్హోం తెలిపారు. కరోనా కనుమరుగు కావడానికి ఏండ్లు పడుతుందన్నారు. కేసులు తగ్గడంతో ఆంక్షలు సడలించారని, దీంతో వచ్చే ఆరు నెలల్లో కొత్త వేవ్లు విరుచుకుపడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని వారందరికీ టీకా వేసేలోపు అప్పటికే అందరికీ వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదన్నారు. ప్రపంచమంతటా ఒకేసారి మహమ్మారి కనుమరుగు కాబోదని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో వైరస్ తగ్గుముఖం పట్టొచ్చని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఎరికా చార్టర్స్ అన్నారు. టీకా రెండు డోసులు వేసుకున్నవారికి కరోనా ఒక సాధారణ వైరస్లాంటిదేనని బ్లూమ్బర్గ్ కాలమిస్ట్ డేవిడ్ ఫిక్లింగ్ అభిప్రాయపడ్డారు.