లండన్: బ్రిటన్ రాజధాని లండన్లో ఒక ఉపాధ్యాయురాలు హత్యకు గురైంది. స్నేహితుడ్ని కలిసేందుకు ఆమె పబ్కు నడిచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 28 ఏండ్ల సబీనా నెస్సా లండన్లో టీచర్గా పని చేస్తున్నది. ఈ నెల 17న రాత్రి 8.30 గంటలకు తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. కిడ్బ్రూక్ విలేజ్లోని కేటర్ పార్క్లో నడుస్తూ పెగ్లర్ స్క్వేర్లోని డిపో బార్లో ఉన్న స్నేహితుడ్ని కలిసేందుకు బయలుదేరింది. అయితే స్నేహితుడ్ని కలవని ఆమె ఆ పార్క్లో హత్యకు గురైంది.
మరునాడు సబీనా మృతదేహాన్ని పార్క్లో గుర్తించారు. ఈ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్న 38 ఏండ్ల వ్యక్తిని లెవిషమ్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లోని వ్యక్తి, వాహనం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వ్యక్తి, సంబంధిత వాహనం గురించి ఏమైనా సమాచారం తెలిస్తే తమకు చెప్పాలని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ నీల్ జాన్ కోరారు. సబీనా మృతదేహానికి సోమవారం చేపట్టిన పోస్ట్మార్టం ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.