ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. చిత్రాన్ని కరణ్ జోహార్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 9న మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఇండియన్ మైకేలా జాక్సన్ ప్రభుదేవాని కలిసి అతనితో ఫొటో దిగింది.
పూరీ జగన్నాథ్, ఛార్మిలు ప్రభుదేవాతో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఈ పిక్ చూసి నెటిజన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు. లైగర్ చిత్రంలో ప్రభుదేవా ముఖ్య పాత్ర పోషించనున్నాడని అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రభుదేవా ప్రస్తుతం దర్శకుడిగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక లైగర్ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు