గుండాల, మార్చి 30: రైతును రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మించిన రైతువేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడమే కాకుండా రూ.22లక్షల వ్యయంతో రైతువేదిక భవనాన్ని నిర్మించారన్నారు. రైతువేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి రైతులకు అందుబాటులో ఉంటూ పంటల సాగుకు మెలకువలను వివరిస్తారని, రైతువేదిక భవనంలోనే మట్టి నమూనా పరీక్షలు నిర్వహించి భూసార వివరాలు తెలియజేస్తారన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతుల కొరకు 24 గంటల నాణ్యమైన విద్యుత్, సాగు నీటిని అందిస్తున్నారని గుర్తు చేశారు.
గతంలో తెలంగాణ కరువు కాటకాలతో విలపించేదని, నేడు కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పూడిక తీయడంతో చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబీమా ద్వారా రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు, దీని కోసం ఏడాదికి బీమా కింద ప్రతి రైతు పేరున బీమా కంపెనీకి రూ.3వేలను చెల్లిస్తుందన్నారు. నేడు ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. రైతులు సమస్యలను వ్యవసాయ అధికారులతో సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్బాబు, జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్, రైతుబంధు కమిటీ మండల కన్వీనర్ పాండరి, డీఏవో అనురాధ, ఏడీఈ వెంకటేశ్వర్లు, ఏవో సంతోషి, సర్పంచులు బండారి సంధ్యారాణి, యాస భాషిరెడ్డి, బబ్బూరి గాయత్రి, గూడ ఉపేంద్ర, ఎంపీటీసీలు పొన్నగాని మహేశ్, పాయిలి కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దశరథ, ప్రధాన కార్యదర్శి మూగల శ్రీనివాస్, నాయకులు సంగివేణుగోపాల్, హరితాదేవి, రామకృష్ణారెడ్డి, ప్రకాశ్, మహోదయ్, ఉస్మాన్ పాల్గొన్నారు.
రైతుల సంఘటితం కోసమే రైతువేదికలు
రైతులు సంఘటితం కోసమే సీఎం కేసీఆర్ గ్రామాల్లో రైతువేదికలను నిర్మిస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శారాజీపేట గ్రామంలో నిర్మించిన రైతువేదిక భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతువేదికల నిర్మాణాలతో రైతులంతా ఒకే చోటా కూర్చోని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడానికి సులువుగా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. అనంతరం శ్రీనివాసపురం, టంగుటూరు, కొల్లూరు గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, తహసీల్దార్ గణేశ్నాయక్, ఎంపీడీవో జ్ఞానప్రకాశ్రావు, సర్పంచ్లు బండ పద్మాపర్వతాలు, ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏవో లావణ్య, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ రవి, ఉప సర్పంచ్ కంతి మహేందర్, రైతులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
దర్శనం టికెట్లుంటేనే తిరుమలకు అనుమతి