కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కొన్ని గంటల ముందు ఆ దేశ ప్రధాని ఆష్రాఫ్ ఘనీ (Ashraf Ghani) దేశం విడిచి పారిపోయారు. తుపాకులకు సామాన్యులు బలికావద్దనే ఉద్దేశంతోనే దేశం వదిలి వెళ్లిపోయానని తొలుత తెలిపిన ఘనీ.. ఇన్నిరోజులకు మనుసు విప్పి ప్రకటన జారీ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
ఒక జత బట్టలు, సాండిల్స్తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లిపోయానని గత నెల 18 న ఘనీ వీడియో ప్రకటన విడుదల చేశారు. దీని తర్వాత ఆయన లక్షల కోట్లు సూట్కేసుల్లో నింపుకుని పారిపోయారని తాలిబాన్లు ఘనీపై ఆరోపణలు గుప్పించారు. కాగా, బుధవారం అన్ని విషయాలతో కూడిన ప్రకటనను ట్విట్టర్ ద్వారా ఘనీ విడుదల చేశారు. కాబూల్ వీడటం తన జీవితంలో తీసుకున్న అతి కష్టమైన నిర్ణయమని ఘనీ తెలిపారు. అయితే, కాల్పులను నిలుపుదల చేసేందుకు ఇదే సరైన నిర్ణయం అని, కాబూల్తోపాటు ప్రజలను రక్షించేందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య గణతంత్ర సూత్రం మాత్రమే సౌర్వభౌమ, శాంతియుత, సుసంపన్న ఆఫ్ఘనిస్తాన్ ముందున్న ఏకైక మార్గమని తాను గట్టిగా నమ్ముతున్నట్లు వెల్లడించారు. తన, తన భార్యకు సంబంధించిన ఆస్తులను ఏనాడో ప్రజలకు వెల్లడించామని, దేశం విడిచి వెళ్లిపోతూ లక్షల కోట్లు ఎత్తుకెళ్లానని చేస్తున్న ఆరోపణలు సత్యదూరాలని, వాటిలో ఎంతమాత్రమూ నిజం లేదని అష్రఫ్ ఘనీ పేర్కొన్నారు.
పాకిస్తాన్లో ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్
మంచి ఫుడ్ తిన్నా.. 50ల్లో గుండె సమస్యలు ఎందుకొస్తాయి?
ఆఫ్ఘన్లో నాలుగో రోజు మహిళల ఆందోళన
సరిహద్దులో అత్యవసర ల్యాండింగ్కు ఎయిర్ స్ట్రిప్
జనవరి నుంచి కొత్తగా ఆన్లైన్ కార్డ్ చెల్లింపు వ్యవస్థ
యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్
జో బైడెన్కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?
Star Trek : స్టార్ ట్రెక్ సిరీస్కు 55 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..