నాగిరెడ్డిపేట్/పిట్లం/దోమకొండ/రామారెడ్డి/ మాచారెడ్డి/ బీబీపేట్/ కామారెడ్డి రూరల్, జూన్ 25 : నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్, నాగిరెడ్డిపేట్, మెల్లకుంట తండా, జాన్కంపల్లి, బెజుగం చెరువు తండా, పల్లెపొగుడ తండా గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించినట్లు ఎంపీడీవో రఘు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, మొక్కల పంపిణీ, గ్రామ పంచాయతీల నిధుల ఖర్చు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎల్పీవో రాజేంద్రప్రసాద్, ఎంపీపీ రాజ్దాస్, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచులు సాయిలు, వంజరి సునీత, కిచ్చయ్యగారి సునీతారెడ్డి, పీర్యాతోపాటు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పిట్లం మండలంలోని చిన్నకొడప్గల్లో సర్పంచ్ కవిత అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు తీర్మానం చేశారు. హస్నాపూర్ గ్రామంలో సర్పంచ్ గోపాల్రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో విండో చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీటీసీ వెంకట్రెడ్డి, నారాయణ, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, గోవింద్రెడ్డి, రహమతుల్లా, పంచాయతీ కార్యదర్శులు బలరాం, శేఖర్గౌడ్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
దోమకొండ మండలంలోని అంచనూర్, చింతమాన్పల్లి, సంగమేశ్వర్, లింగుపల్లి, సీతారాంపూర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచులు బురాని సమత, సార్ల నర్సవ్వ, కరికె సుమలత, స్వరూప అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. పల్లెప్రగతి, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామసభలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఎంపీవో తిరుపతి, ఏవో పవన్, తహసీల్దార్ అంజయ్య, ఉపసర్పంచులు నరేశ్, యాదయ్య, జెట్టబోయిన నరేశ్, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్, రాహుల్, అఖిల పాల్గొన్నారు.
రామారెడ్డిలో సర్పంచ్ సంజీవ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. పల్లె ప్రగతి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. గ్రామ ప్రధాన రహదారి మీదుగా రథాలగైని నుంచి కాలభైరవస్వామి ఆలయం వరకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు. వార్డుల్లో మురికి కాలువల నిర్మాణం గురించి చర్చించారు. కార్యక్రమంలో సర్పంచులు సంజీవ్, ఉపసర్పంచ్ పోతునూరి ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమధు వాత్సవ, అగ్రికల్చర్ ఏఈవో రాకేశ్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మాచారెడి మండలం వాడి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సర్పంచ్ సౌజన్య వివరించారు. గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధుల ఎస్టిమేషన్ను రూపొందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంగారెడ్డి, వార్డుమెంబర్లు పాల్గొన్నారు.
బీబీపేట్ మండలం మల్కాపూర్, తుజాల్పూర్లో సర్పంచులు రాంరెడ్డి, సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. గ్రామంలోని సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంబళ్ల రవి, పంచాయతీ కార్యదర్శి కాశీ కళ్యాణ్, ఇంతియాజ్, వార్డు సభ్యులు వెంగళ్ రావు, లక్ష్మి, చామంతి పాల్గొన్నారు.కామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. రాఘవపూర్ గ్రామంలో సర్పంచ్ కదిరె సాగర్గౌడ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.