కొవిడ్ బాధితుల సంఖ్య నానాటికి తీవ్రమవుతున్న దృష్ట్యా వనస్థలిపురం ఏరియా దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్కు మరిన్ని ఏర్పాట్లు చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం దవాఖానను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీకా వేయించుకునేవారి సంఖ్య పెరుగుతోందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లను విస్తరిస్తామన్నారు. రోజూ 3నుంచి 8వందల మంది దవాఖానకు వస్తున్నారన్నారు. ఒకే గదిలో టీకాను వేస్తుండటంతో సామర్థ్యం సరిపోవడం లేదన్నారు. తన సొంత ఖర్చులతో దవాఖానకు వెనుకభాగంలో మూడు తాత్కాలిక యూనిట్లను ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు. అందుకు కావాల్సిన సామగ్రిని సమకూరుస్తామని తెలిపారు. వ్యాక్సిన్ కోసం వచ్చేవారు ఎక్కువ సమయం వేచి చూడకుండా ఏర్పాట్లుచేస్తామని వెల్లడించారు.
మహిళలు, పురుషులకు వేర్వేరుగా వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. దవాఖానలో ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని వివరిం చారు. ఆయనతోపాటు బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రావుల వెంకటేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, డీసీహెచ్ఎస్ ఝాన్సీ, సూపరింటెండెంట్ హరిప్రియ, ఆర్ఎంవో సోమశేఖర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, సుమన్గౌడ్, అనిల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.