లండన్: బ్రిటన్లోని వెస్ట్యార్క్షైర్ ప్రాంతంలోగల బ్యాట్లే అండ్ స్పెన్ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లేబర్ పార్టీ అభ్యర్థి కెయిర్ స్టార్మర్.. భారత ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కలిసిన దిగిన ఫొటోను తన ఎన్నికల ప్రచారం కోసం అచ్చు వేయించిన కరపత్రంలో పెట్టుకున్నాడు. ఆ ఫొటో కింద మీకు మద్దతివ్వని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీని ప్రమాదంలోకి నెట్టొద్దు అనే వ్యాఖ్యను జోడించారు.
అయితే, దీనిపై కన్జర్వేటివ్ పార్టీ నేతలతోపాటు సొంత పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత్ వ్యతిరేక, విభజించి పాలించే ధోరణికి ఆ కరపత్రం నిదర్శనమని పలువురు దుయ్యబట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వ అధినేత, బ్రిటన్కు సన్నిహితమైన దేశ నేత ఫొటోను ఇక్కడి ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం వినియోగించుకోవడం విచారకరమని ఆ దేశంలో భారత సంతతికి ప్రాతినిధ్యం వహించే ‘లేబర్ ఫ్రండ్స్ ఆఫ్ ఇండియా’ సంస్థ ఒక ప్రకటనలో దుయ్యబట్టింది.