లండన్: ప్రముఖుల మైనపు విగ్రహాలు రూపొందించి వాటిని ప్రత్యేక మ్యూజియంలో ఏర్పాటు చేసే మేడమ్ టుస్సాడ్స్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే మైనపు బొమ్మలను బ్రిటన్ రాయల్ కుటుంబం గ్రూప్ నుంచి వేరు చేసింది. వారిద్దరి మైనపు బొమ్మలను హాలీవుడ్ సెలబ్రెటీల సెక్షన్లోకి మార్చింది.
“హ్యారీ, మేఘన్ జోన్లు మారారు. మేడమ్ టుస్సాడ్స్ లండన్.. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే మైనపు బొమ్మలను వారి సరికొత్త అవార్డ్స్ పార్టీ జోన్కు తరలించింది, ఫ్రాగ్మోర్ ( బ్రిటిష్ హోమ్ ఫ్రాగ్మోర్ కాటేజ్) నుండి హాలీవుడ్కు వారు తరలినట్లు ఇది ప్రతిబింబిస్తుంది” అని మేడమ్ టుస్సాడ్స్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు ఏడాది కిందట రాజరికాన్ని వీడారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో నివాసం ఉంటున్న వీరు స్వతంత్ర జీవితం గడుపుతున్నారు. రాయల్ కుటుంబంపై ఆధారపడబోమని ప్రకటించిన ఈ దంపతులు తమ అర్జన కోసం నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, ఆపిల్ టీవీతో కంటెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు.