తాండూరు రూరల్, మే 13: కరోనాతో దవా ఖా నాలో చికిత్స పొందు తున్న రోగులకు హ్యాండ్ ఫౌండేషన్, విజయ సా యి దవాఖాన వైద్యు లు ఉచిత భోజనం అం దించి మానవత్వాన్ని చా టుతున్నారు. తాండూ రుకు చెందిన హ్యాండ్ ఫౌం డేషన్ ప్రతినిధులు రుద్రపాటిల్, చంటి యా దవ్, అభిషేక్ తోపాటు విజయ సాయి దవాఖాన వైద్యులు ప్రవీణ్కుమార్గౌడ్, శ్రీనివాస్గౌడ్లు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూట రోగు ల కు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కర్నాట కలోని సులేపేట్, సత్తర్శాల, చించోలి తదితర గ్రామాల నుంచి కరోనా వైరస్తో బాధపడుతూ దవాఖానల్లో చేరారు. తెలంగాణాలో లాక్డౌన్ కారణంగా బాధితులకు భోజనం కరు వైంది. విషయం తెలుసుకున్న హ్యాండ్ ఫౌండే షన్ ప్రతి ని ధులు, విజయసాయి వైద్యులు సం యుక్తంగా నిత్యం 25 మంది రోగులకు ఉచిత భోజనం కల్పిస్తున్నారు. దీంతో బాధితులు, వారి కుటుం బ సభ్యులు సంతోషం వ్యక్త చేశారు.
బాధితులు కోలుకునే వరకు ఉచిత భోజనం
కరోనాతో దవాఖానాలో చికిత్స పొందుతున్న కర్నాకటకు చెందినవారు వైరస్ నుంచి విముక్తి పొందే వరకు ఉచితంగా భోజనం అందజేస్తాం. హ్యాండ్ ఫౌండేషన్, విజయ సాయి దవాఖాన ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా భోజనం అం దిస్తున్నాం. భోజనం లేక రోగుల ఇబ్బందులు చూసి ఉచితంగా భోజనం ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ఇబ్బందులుంటే వారికి కూడా ఉచిత భోజనం అందించేందుకు కృషి చేస్తాం.
– డాక్టర్ శ్రీనివాస్గౌడ్