ఐరాస: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) అడ్వకేట్గా నియమితులయ్యారు. ఈ మేరకు సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ప్రకటించారు. సాధారణ అసెంబ్లీ 76వ సమావేశాలకు ముందు ఈ నియామకం జరిగింది.