అబుదాబి, అక్టోబర్ 28: కొంతమంది అపర కుబేరులు తమ సంపదలో కొద్ది మొత్తం ఇచ్చినా ప్రపంచంలో ఆకలి సమస్యను పరిష్కరించవచ్చని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ) డైరెక్టర్ డేవిడ్ బీస్లే అన్నారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ పేర్లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో బీస్లే మాట్లాడుతూ అలాంటి బిలియనీర్లు పేదలకు సాయం చేసేందుకు ముందుకురావాలని కోరారు. ఎలాన్ మస్క్ తన సంపదలో రెండు శాతం విరాళంగా ఇస్తే ప్రపంచంలో అన్నార్తుల ఆకలి తీర్చవచ్చని బీస్లే చెప్పారు.