ప్యారిస్ : ఫ్రెంచ్ ఓపెన్-2021 పోటీలకు కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్నది. పురుషుల డబుల్స్ ఈవెంట్లో పాల్గొంటున్న ఇద్దరు ఆటగాళ్ళు కరోనా బారిన పడ్డారు. దాంతో ఈ ఇద్దరు ఆటగాళ్ళు డ్రా నుంచి తప్పుకున్నారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మ్యాచ్ మధ్య నుంచి ప్రేక్షకులను మైదానం బయటకు పంపించేశారు. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఫ్రెంచ్ ప్రభుత్వం అర్థరాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (ఎఫ్ఎఫ్టీ) క్వాలిఫైయర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 2,446 పరీక్షలు నిర్వహించారు. ఇదే సమయంలో డబుల్స్ ఆడుతున్న ఆటగాళ్ళు నికోలా మెట్కిక్, మేట్ పావిక్ కరోనా బారిన పడ్డారు. వీరి పేర్లను డ్రా నుంచి తొలగించారు. మరో జోడి జైమ్ మునార్, ఫెలిసియానో లోపెజ్ కూడా టోర్నమెంట్ నుంచి ఉపసంహరించుకున్నారు. ప్రపంచ నంబర్ -2 మహిళా క్రీడాకారిణి నామి ఒసాకా తొలి మ్యాచ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఆదివారం మీడియా సమావేశానికి హాజరుకానందుకు ఆమెకు రూ.10 లక్షలు (15 వేల యూఎస్ డాలర్లు) జరిమానా విధించారు. 2018 లో యూఎస్ ఓపెన్ నుంచి నిరాశతో పోరాడుతున్నానని సోషల్ మీడియాలో సమాచారాన్ని ఒసాకా షేర్ చేసింది. ఈ కారణంగా మీడియా సమావేశానికి రాలేదని తెలుస్తున్నది.
సైకిల్ సవారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వరల్డ్ సైకిల్ డే
భారత్ నుంచి పాకిస్తాన్ విభజన.. చరిత్రలో ఈరోజు
అమ్మాయిలకు మెడిసిన్, ఇంజినీరింగ్లో 33 శాతం రిజర్వేషన్లు
అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..