వాషింగ్టన్: రష్యాకు చెందిన సైబర్ నేరగాళ్లు ఇటీవల అమెరికా కంపెనీలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. రాన్సమ్వేర్ సాఫ్ట్వేర్తో అటాక్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోరారు. ఈ అంశంపై పుతిన్తో ఫోన్లో బైడెన్ మాట్లాడినట్లు వైట్హౌజ్ ప్రతినిధులు తెలిపారు. ఇటీవల జరిగిన సైబర్ దాడుల వల్ల.. అమెరికాతో పాటు పలు దేశాల కంపెనీలు రాన్సమ్వేర్తో విలవిలలాడాయి. అడిగినంత చెల్లిస్తేనే మళ్లీ కంప్యూటర్లు వాడకునేలా చేస్తామని సైబర్ దోపిడీ గ్యాంగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి ఆపరేట్ చేస్తున్న రాన్సమ్వేర్ గ్రూపులను కట్టడి చేయాలని బైడెన్ కోరారు. దాడులు ఇలాగే జరిగితే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.