బీజింగ్, అక్టోబర్ 9: తైవాన్ను విలీనం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. ‘శాంతియుత విలీనం’ జరుగుతుందని వ్యాఖ్యానించారు. చైనా, తైవాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 4 రోజులుగా చైనా డజన్ల సంఖ్యలో తన మిలిటరీ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిస్తున్నది.