ఛండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే కాంగ్రెస్లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ క్రికెటర్ నవజ్యోత్సింగ్ సిద్దును ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్ టార్గెట్గా ఎంచుకున్నారు. ఇప్పటినుంచే ఆయనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆయనకు ఏమాత్రం ధైర్యం ఉన్నా రానున్న ఎన్నికల్లో పాటియాలా నుంచి తనపై పోటీ చేయాలని సిద్ధుకు కెప్టెన్ అమరీందర్ సింగ్ సవాల్ విసిరారు. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతవారినైనా ఉపేక్షేంచేది లేదని ఆయన ఒక ప్రకటన చేశారు.
నవజోత్ సింగ్ సిద్దూ తాను కాంగ్రెస్ సభ్యుడు అన్నది స్పష్టం చేయాలని అమరీందర్ డిమాండ్ చేశారు. ఒకవేళ పార్టీలోనే ఉన్నాననుకుంటే మాత్రం పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సునీల్ జఖర్ చాలా చక్కగా పనిచేస్తున్నందున ఆయన స్థానంలో మరొకరిని నియమించాల్సిన అవసరం లేదని ఖరాకండిగా చెప్పారు. సిద్దూ కాంగ్రెస్లో 4 సంవత్సరాలు మాత్రమే అయిందని, యూత్ కాంగ్రెస్ తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారు చాలా మంది ఉన్నారన్నారు. క్యాబినెట్ మంత్రులు సుఖ్జిందర్ సింగ్ రాంధవా, సునీల్ జఖర్ రాజీనామాలను ఆమోదించడం లేదని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
నవజ్యోత్సింగ్ సిద్దు తన సోషల్ మీడియా ఖాతా నుంచి కాంగ్రెస్ పేరును తొలగించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్పై కూడా అతను ఫ్రంట్ ప్రారంభించాడు. ఇది ప్రభుత్వం లేదా పార్టీ వైఫల్యం కాదని, నేరస్థులతో చేతులు కలిపిన వ్యక్తి వైఫల్యం అని సిద్దు సోషల్ మీడియాలో రాశారు.
ఇద్దరు నియంతలు.. ఒకరి జననం.. ఒకరి మరణం.. చరిత్రలో ఈరోజు
పోలీసుల డాటా చోరీ, ఆపై బ్లాక్ మెయిలింగ్..
అమెరికా జనాభా 33 మిలియన్లు.. 2020 సెన్సెస్ డాటా విడుదల
ఇతను ఆఫ్రికా రామ్దేవ్ బాబా..! వీడియో వైరల్
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..