దవాఖానలో చేరిక
న్యూఢిల్లీ, మార్చి 26: ఛాతిలో కొంత అసౌకర్యంగా ఉండటంతో పరీక్షల కోసం రాష్ట్రపతి కోవింద్ శుక్రవారం ఢిల్లీలోని సైనిక దవాఖానలో చేరారు. సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనను అబ్జర్వేషన్లో ఉంచారు. రాష్ట్రపతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని డాక్టర్లు చెప్పారు.