టోక్యో: జపాన్ తొలిసారిగా మంగళవారం ఏకాంత మంత్రి (లోన్లీనెస్ మినిస్టర్)ని నియమించింది. కరోనా మహమ్మారి వేళ జపాన్లో ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఒంటరితనంతో కుంగిపోయే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి చైతన్యపరిచేందుకు ఈ మేరకు టెట్సుషీ సకమొటోను నియమించింది. మంత్రివర్గంలోకి ఈ నెలలోనే ఏకాంత మంత్రిని కూడా చేర్చినట్టు ప్రధానమంత్రి యోషిహిడె సుగ వెల్లడించారు. బిట్రన్ 2018లోనే ఇటువంటి పాత్రను నియమించినట్టు తెలిపారు.