Jaish seeks Talibans help on Kashmir | కశ్మీర్ అంశంపై తమకు సాయం చేయాలని తాలిబన్ నాయకత్వాన్ని పాక్ నుంచి జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జైషే మహ్మద్ వ్యవస్థాపక అధినేత మౌలానా మసూద్ అజర్ ఇటీవల ముల్లా అబ్దుల్ ఘనీ బారాదార్తోపాటు ఇతర తాలిబన్ల నేతలతో భేటీ అయినట్లు సమాచారం. జమ్ముకశ్మీర్ లోయలో జైషే మహ్మద్ కార్యకలాపాలు చేపట్టేందుకు సాయం చేయాలని తాలిబన్లను కోరినట్లు వార్తలొచ్చాయి. ఈ మేరకు మౌలానా మసూద్ అజర్.. కాందహార్కు వెళ్లినట్లు వినికిడి.
ఈ నెల 15న కాబూల్ను తాలిబన్లు వశం చేసుకుని విజయం సాధించిన మరుసటి రోజు మసూద్ అజర్ సంతోషం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా మద్దతుతో పాలన సాగించిన ఆఫ్ఘన్ సర్కార్ను కూల్చివేసినందుకు తాలిబన్లను ఆయన ప్రశంసించినట్లు సమాచారం. పాకిస్థాన్లోని బహవాల్పూర్లో గల జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్లో సంస్థ సభ్యులు ఒకరినొకరు అభినందించుకున్నట్లు తెలుస్తున్నది.
ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్లో ముజాహిదిన్ల విజయం అని పేర్కొంటూ మసూద్ అజర్ మెసేజ్ పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఆఫ్ఘన్ను ఏ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించబోమని ఇంతకుముందు తాలిబన్లు ప్రకటించడం గమనార్హం.