ఆదిలాబాద్ : జిల్లాలోని భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో గురువారం వరద ప్రవాహంలో రోజువారీ కూలీ కొట్టుకుపోయాడు. మృతదేహాన్ని ముళ్ల పొదలో గుర్తించారు. మృతుడు నిపాని గ్రామానికి చెందిన వెంకట్ గౌడ్ (45) అని భీంపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా నీటి ప్రవాహంలోకి విపరీతంగా వరద పెరిగింది. ఇంటికి వెళ్లే నిమిత్తం కాలులోకి దిగగా నీటి ప్రవాహానికి తాళలేక నీటి సుడుల్లో చిక్కుకుని కొట్టుకుపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని భార్య జ్యోతికి అనుమానం పెరిగింది. తన భర్తను పొలం పనులకు పిలిచిన రైతును ఆమె ఆరా తీసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా పొదల్లో వెంకట్ మృతదేహాన్ని కనుగొన్నారు. బాధితురాలు జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.