ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. గోపీకృష్ణమూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా షూటింగ్ను త్వరలో పునఃప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కేవలం పది రోజులు మాత్రమే చిత్రీకరణ బ్యాలెన్స్గా ఉన్నట్లు సమాచారం. అలనాటి యూరప్ను తలపించేలా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేక సెట్స్ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. వాటిలో ప్రభాస్, పూజాహెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్య ఘట్టాలను చిత్రీకరించనున్నట్లు చెబుతున్నారు. ఈ షెడ్యూల్తో టాకీపార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. దసరాకు ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.