ఢిల్లీ, జూన్ 11: టోక్యో ఒలింపిక్స్-2020లో పాల్గొననున్న భారత జట్లు, క్రీడాకారుల ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వం నిరంతరాయంగా సమీక్షించనుంది. అథ్లెట్ల పని తీరును మెరుగుపరచడానికి కోచ్లు, వైద్యులు, ఫిజియోథెరపిస్టులు వంటి అదనపు సహాయక సిబ్బందిని నియమించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అథ్లెట్లు, కోచ్లు, సహాయక సిబ్బంది తప్ప వేరే వ్యక్తులను టోక్యోకు పంపడం లేదని తెలిపింది. ఈ ఏర్పట్లలో భాగంగా టోక్యో ఒలింపిక్స్కు మంత్రివర్గ ప్రతినిధుల బృందం పంపడం లేదని కేంద్రం తెలిపింది. లాజిస్టిక్ మద్దతును అందించడానికి గాను టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలో ఒక ప్రత్యేక ఒలింపిక్ మిషన్ సెల్ ఏర్పాటు చేశారు.దీని ద్వారా అన్ని రకాల సహాయం సజావుగా అందించనున్నారు.