నిరాడంబరంగా డోలోత్సవం
తలంబ్రాలు కలిపిన భక్తులు
ఈసారి సాదాసీదాగా నవమి వేడుకలు..
కల్యాణ టిక్కెట్లు తీసుకున్న వారికి డబ్బులు వాపస్
భద్రాచలం, మార్చి 28: భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం నిరాడంబరంగా వసంతోత్సవం, డోలోత్సవ వేడుకలు జరిగాయి. అర్చకులు యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. స్వామివారికి కుంభ, ధ్వజ, అష్ట, ద్వాదశ హారతులు సమర్పించారు. ఆస్థాన స్థానాచార్యుడు కేఈ స్థలశాయి ‘మాణిక్యం గట్టి” అనే ద్రావిడ పాశురాన్ని గానం చేశారు. అర్చకులు వసంతున్ని ఆవాహన చేశారు. సుగంధ ద్రవ్యాలతో అంతరాలయానికి చేరుకొని మూలమూర్తులకు మహా కుంభ ప్రోక్షణ చేసి వసంతాన్ని భక్తులపై చల్లారు. స్వామివారిని ఊయలలో ఉంచి డోలోత్సవం నిర్వహించారు. ఆస్థాన హరిదాసులు లాలీ పాటలు, తూము నర్సింహదాసు కీర్తనలు, భక్త రామదాసు కీర్తనలు ఆలపించారు. తయారు చేసిన తొమ్మిది పసుపు ముద్దల్లో ఒకదానిని రామయ్య శిరస్సున, మరొక దానిని సీతమ్మ మంగళ సూత్రంపై, మూడో ముద్దను లక్ష్మణస్వామి వక్షస్థలంపై ఉంచారు. దీంతో రామయ్యను పెళ్లికొడుకుగా సీతమ్మ తల్లిని పెళ్లి కూతురుగా భావిస్తారని అర్చకులు తెలిపారు.
చిత్రకూట మండపంలో సంప్రదాయబద్ధంగా పసుపు దంచే వేడుక చేపట్టారు. అర్చకులు విశ్వక్సేన ఆరాధన తర్వాత రోకళ్లలో లక్ష్మీ సరస్వతులను ఆవాహన చేశారు. రోకళ్లు, రోలుకు రక్షా బంధనం చేశారు. తొమ్మిది మంది ముత్తై దువులు పసుపును రోలులో వేసి దంచారు. అలాగే రామయ్య కల్యాణానికి వినియోగించే తలంబ్రాల తయారీకి సిబ్బంది శ్రీకారం చుట్టారు. పట్టాభిషేక ఘట్టం శిల్పం వద్ద తలంబ్రాలను తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాలతో కలిపారు. తలంబ్రాలను ఈఓ శివాజీ శిరస్సుపై మోస్తూ మూలమూర్తులకు చూపించారు.
ఇవి కూడా చదవండి..
కూల్డ్రింక్స్ అధికంగా తాగితే డేంజరే..!
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు