కాబూల్ : తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకోగానే.. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆదివారం దేశం విడిచి వెళ్లిపోయాడు. అనంతరం తాలిబాన్లు అధ్యక్షుడి భవనాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దేశం విడిచి పారిపోయాడనే అపవాదు రాకుండా ఉండేందుకు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) దేశ పౌరులను ఉద్దేశించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ లేఖలో తానెందుకు దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందనే విషయాలను విడమర్చి చెప్పారు. బహిరంగ లేఖ సారాంశమిది..
‘ప్రియమైన ప్రజలారా! ఈ రోజు నాకు దుర్దినం. తాలిబాన్లు దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు రాజధాని నగరాన్ని సైతం తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అధ్యక్ష భవనంలో వచ్చేందుకు సిద్ధమవగా.. నేను అధికార పీఠాన్ని వదిలి వెళ్తున్నాను. ఇలా ఎందుకు వెళ్తున్నానంటే.. దేశంలో అమయాక ప్రజల నెత్తురు పారకుండా ఉండేందుకే..! ఇప్పటికే చాలా మంది పౌరులు మన కండ్ల ముందే ప్రాణాలు వదిలారు. మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. ఎందరో నిరాశ్రయులయ్యారు. నన్ను దారి నుంచి తప్పించాలని తాలిబాన్ నిశ్చయించుకున్నది. కాబూల్పై దాడి చేయడానికి వారు ఇక్కడికి వచ్చారు. ఈ రక్తపాతాన్ని ఆపడానికి నేను ఇక్కడ నుంచి వెళ్లిపోవడమే మంచిదన్న నిర్ణయానికొచ్చాను. తాలిబాన్లు ఈ యుద్ధాన్ని కత్తులు, తుపాకులతో గెలిచారు. ఇప్పుడు ప్రజల గౌరవం, సంపదను కాపాడాల్సిన బాధ్యత తాలిబాన్లదే. ప్రజల హృదయాలను తాలిబాన్ గెలుచుకోలేదు. ఇప్పుడు తాలిబాన్ ముందు పెద్ద పరీక్ష ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పేరు, గౌరవాన్ని కాపాడటంపైనా లేదా మరెక్కడైనా విస్తరణ చేపట్టడంపై దృష్టి పెడతారనే విషయాన్ని తాలిబాన్ తేల్చుకోవాలి. దేశంలోని ప్రజలు ముఖ్యంగా మహిళల హృదయాలను గెలుసుకుంటామని వారు హామీ ఇవ్వడం అవసరం. సదా నా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధం. ఇంకా చాలా విషయాలు ముందున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ జిందాబాద్’ అని లేఖను ముగించారు.
దేశం విడిచి వెళ్లిపోయిన అష్రఫ్ ఘనీపై తాలిబాన్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన దేశం విడిచి పారిపోతూ పెద్ద ఎత్తున నగదు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని, దాదాపు 50 లక్షల డాలర్ల నగదు అధ్యక్ష భవనం హెలిప్యాడ్లో ఉండటాన్ని గుర్తించామని వారు పేర్కొన్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఘనీ దేశం విడిచి పారిపోయి ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. ఇలాఉండగా, అర్థరాత్రి వేళ కాబూల్లో పలుమార్లు పేలుళ్ల ధ్వనులు వినిపించాయి. అయితే, దీనిని తాలిబాన్ వర్గాలు ధ్రువీకరించలేదు.
ఆ మెసేజ్ అందడానికి 18 గంటలు పట్టింది..!
సోషల్ మీడియాలో జాతీయ గీతం కొత్త రికార్డు.. అదేంటంటే..?
ముంబై ఇండియన్స్కు వెరైటీగా అనౌన్స్మెంట్
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..