జనగామ : స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారుజామున మహమ్మద్ అజీమియా (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే అజీమియా హత్యతో సముద్రాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక సీఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్సైలు రమేష్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.