కీసర, ఏప్రిల్ 30 : స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలకు ప్రభుత్వం పెద్దపీఠ వేస్తున్నది. ప్రతి సంవత్సరం అందజేసే బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యం భారీగా పెంచింది. దీనికి తోడు డ్వాక్రా సంఘాల పనితీరు కూడా ఏయేడుకాయేడు పెరుగుతుండటంతో ప్రభుత్వం స్వయం సంఘాల పనితీరు ను దృష్టిలో ఉంచుకొని నేరుగా ప్రభుత్వం ఆ సంఘాలకు రుణాలు అధిక మొ త్తంలో ఇస్తున్నది. 2021-2022సంవత్సరానికి గాను కీస ర మండల మహిళా సమాఖ్య సంఘాలకు కీసర స్టేట్ బ్యాంక్, చీర్యాల్ స్టేట్ బ్యాంక్ల నుంచి రూ. 22 కోట్ల మంజూరు చేసింది. ప్రభు త్వం ఈ రుణాలను మండల మహిళా సమాఖ్య సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతి గ్రూపు వారికి రుణాలు ఇస్తున్నారు. మండల సమాఖ్య సంఘంలో మొత్తం 594 మహిళా డ్వాక్రా గ్రూపులున్నాయి.
ఒక్కో గ్రూపునకు రూ. 8లక్షల నుంచి మొద లు 10లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి నిర్ణయించారు. మండలంలోని భోగారం, చీర్యాల్, రాంపల్లిదాయర, అంకిరెడ్డిపల్లి, కరీంగూడ, కీసర, యాద్గార్పల్లి, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, గోధుమకుంట తదితర గ్రామాల్లో ఉన్న 594డ్వాక్రా గ్రూపులకు మొత్తం రూ. 22కోట్ల మంజూరు చేయగా వాటిలో ఇప్పటికీ రూ. 21కోట్ల డ్వాక్రా సంఘాలకు పంపిణీ చేయడం జరిగింది. వీటిలో ఒక్కో గ్రూపు రూ. 5నుంచి 10లక్షల చొప్పున వారి పెట్టుకొనే స్వయం ఉపాధి పథకాన్ని దృష్టిలో పెట్టుకొని అందిస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 22కోట్లు స్వయం ఉపాధి కింద పని చేసుకునే గ్రూపులకు అందిస్తామని మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు. రుణాలు తీసుకున్న సంఘం సభ్యులంతా బట్టలు, గెదేలు, ఫినాయిల్ వ్యాపారాలను చేస్తూ వ్యాపార రంగంలో మరింత ముందుకెళ్తున్నారు.
ప్రభుత్వం అందించిన ఈ రుణాలు బాగా పని చేస్తున్న సంఘాలకు స్వయంగా అందిస్తున్నాం. సంఘాలు సంయుక్తంగా కలిసి వ్యాపారాలు పెట్టుకొని స్వయం ఉత్పత్తి కింద అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడుతాయి. స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొంది ఎవరి కాళ్ల మీద వారు బ్రతుకడానికి ఈ రుణాలు ఎంతో ఉపయోగపడుతాయి.- రమాదేవి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు
మహిళా సమాఖ్య సంఘం, ప్రభుత్వం నుంచి ఈ సంవత్స రం అన్ని డ్వాక్రా గ్రూపులకు త గిన ప్రాధాన్యత కల్పించి రుణాలను అందిస్తు న్నాం. సంఘం నుంచి రుణాలు తీసుకున్న మహిళలంతా సొంత వ్యాపారాలను ఏర్పా టు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. సమాఖ్య సం ఘం కార్యాలయంలో ఉన్న కో-ఆర్డీనేటర్లం తా సంఘం పనితీరు మీద గ్రూపు వారిని ప్రోత్సాహించి వ్యాపారాలు చేసుకొనే విధంగా చేస్తున్నారు. – లక్ష్మి మహిళా సమాఖ్య కార్యదర్శి