ఇరాన్లో మంచు తుఫాను.. చనిపోయిన 10 మంది పర్వతారోహకులు

టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఉత్తరాన ఉన్న పర్వతాలలో మంచు తుఫాను సంభవించింది. ఈ ఘటనలో కనీసం 10 మంది పర్వతారోహకులు మరణించినట్లు, మరెందరో కనిపించకుండా పోయినట్లు అక్కడి మీడియా శనివారం రాత్రి నివేదించింది. ఇద్దరు చనిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. సంబంధిత కుటుంబాలు అధికారులను సంప్రదించడంతో తప్పిపోయిన వారి సంఖ్య తెలుస్తున్నది. తుఫాన్ కారణంగా పర్వతంపై తొమ్మిది మంది మరణించగా.. ఒకరిని రక్షించి దవాఖానకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ అత్యవసర ఆపరేషన్ల అధిపతి మెహదీ వాలిపూర్ తెలిపారు. శనివారం రాత్రి పడటంతో అన్వేషణ మానేసి.. తిరిగి ఆదివారం ఉదయం ప్రారంభించారు.
టెహ్రాన్కు ఎదురుగా ఉన్న అల్బోర్జ్ పర్వత చైన్ యొక్క తోచల్, కోలాచల్ శిఖరాలపై హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చేరుకున్నాయి. చెడు వాతావరణం, మంచు కారణంగా పర్వతంపై కనిపించకుండా పోయినవారిని గుర్తించడం రెస్క్యూ మిషన్ సంక్లిష్టంగా మారింది. టెహ్రాన్ అల్బోర్జ్ పర్వత శ్రేణి పాదాల వద్ద ఉంది. ఇది అనేక స్కీ రిసార్ట్లను కలిగి ఉంది. 5,671 మీటర్లు (18,606 అడుగులు) ఎత్తైన శిఖరాన్ని కలిగి ఉంది. 2017లో సంభవించిన మంచు తుఫాను కారణంగా 11 మంది చనిపోయారు. భారీగా మంచుతో కూడిన గాలులు ఇరాన్లోని పలు ప్రాంతాల్లో గందరగోళానికి కారణమయ్యాయి. ఇరానియన్ రవాణా నౌకలోని ఏడుగురు సిబ్బంది కోసం సముద్ర అధికారులు శోధిస్తున్నారని శుక్రవారం అధికారిక వార్తా సంస్థ ఇస్నా తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి అల్లోల శుభాకాంక్షలు
- భారత్కు బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు
- కనకరాజును సన్మానించిన జడ్పీచైర్పర్సన్, ఎమ్మెల్యేలు
- ఉద్రిక్తంగా కిసాన్ పరేడ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
- తేజస్వీ అందాల ఆరబోత.. వైరల్గా మారిన పిక్
- పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- రాజ్పథ్లో మెరిసిన కెప్టెన్ ప్రీతీ చౌదరీ..
- రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
- టీ-90 భీష్మ.. బ్రహ్మోస్ లాంచర్..పినాకా రాకెట్
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు