తబలీసి, జూన్ 21: 1500 రూపాయల పెట్టుబడితో జార్జియాకు చెందిన క్రిస్ విలియమ్స్ అనే యువకుడు కోటీశ్వరుడయ్యాడు. కోటీశ్వరుడు అంటే మామూలు కోటీశ్వరుడు కాదు.. వారం రోజుల్లోనే కోటి కోట్ల రూపాయలు సంపాదించాడు. మాంచెస్టర్లో చదువుకొంటున్న విలియమ్స్ 8 నెలల నుంచి క్రిప్టో కరెన్సీపై అధ్యయనం చేస్తున్నాడు. గతవారం రాకెట్ బన్నీ అనే క్రిప్టో కరెన్సీలో 20 డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. ఈ కరెన్సీ విలువ వారం రోజుల్లోనే 1.4 ట్రిలియన్ డాలర్లకు (కోటి కోట్లకు) ఎగబాకింది. విలియమ్స్ వెంటనే ఈ మొత్తాన్ని వేరే వాలెట్లోకి మార్చడానికి ప్రయత్నించాడు. తాను ఇన్వెస్ట్ చేసిన కాయిన్ బేస్ వాలెట్ను సంప్రదించాడు. అయితే దీంట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీని పరిష్కారానికి రాకెట్ బన్నీని సంప్రదిస్తున్నామని జవాబు వచ్చింది. తర్వాత ఎలాంటి సమాచారం లేదు. కాయిన్ బేస్ కూడా విలియమ్స్ ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఖాతాను నిలిపివేసింది.