జకార్తా/న్యూఢిల్లీ : కొవిడ్-19 బారినపడిన భారత్ లో ఇండోనేషియా రాయబారి పెర్దీ పై మహమ్మారితో బాధపడుతూ జకార్తాలో మరణించారు. పెర్దీ పై ఢిల్లీలో ఉండగా ఆయనకు నిర్వ హించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఢిల్లీలోనే పలు వారాలు చికిత్స పొందిన అనంతరం ఆరోగ్య పరిస్థితి క్షీణించండతో ఏప్రిల్ 27న ఆయనను జకార్తాకు తరలించారు.
కరోనా చికిత్స పొందుతూ పెర్దీ పై మంగళవారం కన్నుమూశారని ఇండోనేషియా దౌత్య కార్యాలయం తమ ట్విటర్ ఖాతాలో పేర్కొంది. భారత్ లో ఇండోనేషియా రాయబారి షెర్దీ పై మరణం పట్ల ఢిల్లీలోని ఇండోనేషియా దౌత్య కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పెర్దీ పై మార్గదర్శకత్వం, నాయకత్వం, ఆయన చూపిన కరుణ ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఓ ప్రకటనలో పేర్కొంది.