లింగంపేట, మార్చి23: మండలంలోని శెట్పల్లి గ్రామ శివారులో ఉన్న పెద్దవాగుపై చెక్డ్యామ్ నిర్మాణ పనులను ఎంపీపీ గరీబున్నీసాబేగం మంగళవారం ప్రారంభించారు. చెక్డ్యామ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2 కోట్ల 50 లక్షల నిధులను మంజూరు చేసిందని ఎంపీపీ తెలిపారు. చెక్డ్యామ్ నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల్లో భూగర్భ నీటిమట్టం పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో శెట్పల్లి సర్పంచ్ పద్మ, నీటి పారుదలశాఖ డీఈఈ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రూప్సింగ్, దేవేందర్, శర్వన్, లింగంపేట విండో చైర్మన్ దేవేందర్రెడ్డి, నాయకులు నయీం, గంగారెడ్డి, సత్యనారాయణ, లింగం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు..
బీర్కూర్, మార్చి 23 : మండలంలోని చించోలి గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఎంపీపీ తిలకేశ్వరి రఘు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులు రూ. 10 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులను చేపట్టామని, నిధుల మంజూరుకు సహకరించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పెర్క పెద్ద అంబయ్య, మండల కో -ఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం, నాయకులు కొరిమె రఘు, అశోక్ అప్ప, రాంబాబు, భాస్కర్ పాల్గొన్నారు.
డ్రైనేజీ నిర్మాణ పనులు..
పిట్లం, మార్చి 23: పిట్లం గ్రామ పంచాయతీ పరిధిలోని నూతన కాలనీలో సర్పంచ్ విజయలక్ష్మి మురికి కాలువల నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. జేసీబీ సహాయంతో కాలువలను శుభ్రం చేయించారు. రైతు బంధు సమితి గ్రామ కో -ఆర్డినేటర్ జొన్న శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి విఠల్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.