అబుదాబి : ఇకపై భారతీయ పాస్పోర్ట్ హోల్లర్లు టూరిస్ట్ వీసాపై దుబాయ్కు (Dubai Visiting) వెళ్లవచ్చు. అయితే, కొన్ని షరతులు వర్తించనున్నాయి. భారతదేశం సహా అనేక సార్క్ దేశాల పాస్పోర్ట్లను కలిగి ఉన్న ప్రయాణికులను పర్యాటక వీసాపై తమ దేశంలోకి అనుమతించనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. ఇండియా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, ఉగాండా, నైజీరియా పాస్పోర్ట్ హోల్డర్లకు మినహాయింపు ఇచ్చినట్లు గల్ఫ్ న్యూస్ ఫ్లై దుబాయ్ వెబ్సైట్ను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ఇది కోవిడ్-19 ట్రావెల్ ఆంక్షలలో భాగంగా ట్రాన్సిట్ ప్యాసింజర్లు, యూఏఈ పౌరులు లేదా రెసిడెన్సీ హోల్డర్లు మాత్రమే దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించనున్నారు.
పర్యాటకులు తమ దేశానికి చేరుకున్న అనంతరం యూఏఈలోకి ప్రవేశించిన 9 వ రోజున కూడా పాలిమరేస్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) పరీక్ష చేయించుకోవాలని షరతులు విధించారు. పాకిస్తాన్ విమానాశ్రయాలైన ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ నుంచి ప్రయాణికులను యూఏఈ అనుమతించింది. ఇంతకుముందు దేశీయ క్యారియర్ ఇండిగోను ఆగస్టు 24 వరకు ఒక వారం పాటు తమ దేశానికి విమానాలను నడుపకుండా యూఏఈ నిషేధించింది. నివేదికల ప్రకారం, బయలుదేరే విమానాశ్రయంలో తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోని ప్రయాణికులను తీసుకెళ్లడంపై నిషేధం విధించబడింది.
ల్యాబ్లో కృత్రిమ మానవ మెదడు సృష్టి
దేశ రక్షణలో తాలిబాన్ ‘బద్రి 313’.. ఎవరంటే..?
గాంధీకి బదులుగా జిన్నాను చంపి ఉంటే… : సామ్నాలో సంజయ్ రౌత్
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
4 నిమిషాల్లో 20,000 కేలరీల బర్గర్ హంఫట్..!
ఇస్లాం పరువు తీస్తున్న తాలిబాన్ : సయ్యద్ జైనుల్ అబెదిన్
మణిపూర్ గవర్నర్గా లా గణేశన్ నియామకం
లాక్డౌన్ను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో ఆందోళనలు
157 ఏండ్ల క్రితం రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..