శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. సోపోర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల సమావేశమే లక్ష్యంగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో గన్మ్యాన్ షఫ్కత్ అహ్మద్, కౌన్సిలర్ రియాజ్ అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కౌన్సిలర్ షంషుద్దీన్ పీర్ గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘటన నేపథ్యంలో జమ్ముకశ్మీర్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సోపోర్లో భద్రత కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం ఘటనా ప్రాంతంలో, దాని పరిసరాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆ వృద్ధురాలు మృతి.. బీజేపీ, టీఎంసీ మధ్య మళ్లీ మాటల యుద్ధం
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?