హైదరాబాద్ : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై బుక్లెట్ రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భేటీలో పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారంపై సీఎస్ సమీక్షించారు. పల్లె, పట్టణప్రగతి, హరితహారంలో చేయాల్సిన కొత్త కార్యక్రమాలపై చర్చించారు. జులై 1 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం కోసం బృందాలు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా అధికారులు బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.